తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : జులై 7 : స్థిరంగా పసిడి, వెండి ధరలు- నేటి లెక్కలివే!

Gold and silver prices today : జులై 7 : స్థిరంగా పసిడి, వెండి ధరలు- నేటి లెక్కలివే!

Sharath Chitturi HT Telugu
Jul 07, 2024 05:41 AM IST

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు సైతం స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్లాటీనం రేట్లు మాత్రం భారీగా పెరిగాయి. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 67,650గా కొనసాగుతోంది. శుక్రవారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 6,76,500గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 6,765గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర స్థిరంగా రూ. 73,800గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 7,38,000గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,380గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,800గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,950గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,650 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 73,800గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 68,200గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 74,400గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 67,650గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 73,800గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,650గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,800గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,700గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 73,850గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67,650గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,800గా ఉంది.

ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,480గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 94,800కి చేరింది. శుక్రవారం కూడా ఇదే ధర పలికింది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 99,300 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 94,800.. బెంగళూరులో రూ. 93,250గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు ఆదివారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 790 పెరిగి.. రూ. 27,600కి చేరింది. ఆ ముందు రోజు ధర రూ. 26,810గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 27,600గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel

సంబంధిత కథనం