Gold and silver prices today : స్థిరంగా పసిడి ధర, పెరిగిన వెండి రేటు.. నేటి లెక్కిలివే
02 July 2024, 5:47 IST
- Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు పెరిగాయి. ప్లాటీనం రేట్లు పడ్డాయి. ఆ వివరాలు..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 66,240గా ఉంది. సోమవారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 6,62,400గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ప్రస్తుతం 6,624గా ఉంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం స్థిరంగా రూ. 72,270 వద్ద కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 7,22,700గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 7,227గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,390గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,410గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,240 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 72,270గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 66,840గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,920గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 66,240గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,270గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 66,240గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,270గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రే��్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు �� విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 66,290గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 72,310గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66,240గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,270గా ఉంది.
ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి ధరలు ఇలా..
Silver price in Hyderabad : దేశంలో వెండి ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,030గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 పెరిగి రూ. 90,300గా కొనసాగుతోంది. సోమవారం ఈ ధర రూ. 90,200గా ఉండేది.
కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 94,800 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 90,300.. బెంగళూరులో రూ. 90,500గా ఉంది.
ప్లాటీనం ధరలు ఇలా..
దేశంలో ప్లాటీనం రేట్లు స్వల్పంగా పడ్డాయి. 10 గ్రాముల ప్లాటీనం ధర రూ. 40 పడి రూ. 26,570గా ఉంది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 26,570గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.