Gold and silver prices today : జూన్ 21 : స్వల్పంగా పెరిగిన పసిడి, వెండి ధరలు..
21 June 2024, 5:37 IST
- Gold and silver prices today : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్లాటీనం రేట్లు సైతం వృద్ధి చెందాయి. ఆ వివరాలు..
![మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా.. మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..](https://cdn.statically.io/img/images.hindustantimes.com/telugu/img/2024/06/20/400x225/PTI05-10-2024-000207A-0_1718927952650_1718927975685.jpg)
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి.. రూ. 66,410కి చేరింది. గురువారం ఈ ధర రూ. 66,400గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 6,64,100కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 6,641గా కొనసాగుతోంది.
Realme 13 Pro : ఇండియాలో రియల్మీ 13 ప్రో సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్- ఫీచర్స్ ఇవే!
OnePlus Phone Discount : రూ.14వేల డిస్కౌంట్తో వన్ ప్లస్ ఫోన్.. అరగంటలో ఛార్జింగ్.. ఇయర్ బడ్స్ ఫ్రీ!
Xiaomi Phone Discount : రూ.10 వేల డిస్కౌంట్తో షావోమి ఫోన్.. వావ్ అనిపించే కెమెరా ఫీచర్లు
Stock Market : ఏడాది కిందట ఈ షేరు ధర రూ.5 మాత్రమే.. ఇప్పుడు రూ.57.. నెల రోజుల్లో 8 శాతం పెరుగుదల
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 10 వృద్ధి చెంది.. రూ. 72,450కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 72,440గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 పెరిగి.. రూ. 7,24,500గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,560గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,600గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,410 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 72,450గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 67,010గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,000గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 66,410గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,450గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 66,410గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,450గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 66,460గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 72,500గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66,410గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,450గా ఉంది.
ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,260గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 పెరిగి రూ. 92,600గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 92,500గా ఉండేది.
Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 97,200 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 92,600.. బెంగళూరులో రూ. 92,850గా ఉంది.
ప్లాటీనం ధరలు ఇలా..
దేశంలో ప్లాటీనం రేట్లు శుక్రవారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 140 వృద్ధి చెంది రూ. 26,260 చేరింది. క్రితం రోజు ఈ ధర రూ. 26,120గా ఉండేది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 26,260గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.