HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Hyderabad Kerala Tour : బడ్జెట్‌ ధరలోనే 'కేరళ' ట్రిప్ - అలెప్పీ, మున్నార్ అందాలను చూడొచ్చు! తాజా టూర్ ప్యాకేజీ ఇదే

IRCTC Hyderabad Kerala Tour : బడ్జెట్‌ ధరలోనే 'కేరళ' ట్రిప్ - అలెప్పీ, మున్నార్ అందాలను చూడొచ్చు! తాజా టూర్ ప్యాకేజీ ఇదే

30 June 2024, 12:21 IST

    • IRCTC Hyderabad Kerala Tour : కేరళను చూసేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా ఆసక్తి చూపిస్తారు. అలాంటి వారికోసం ఐఆర్‌సీటీసీ టూరిజం….. KERALA HILLS అండ్ WATERS టూర్ ప్యాకేజీ అందిస్తోంది. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి…..
హైదరబాద్ - కేరళ టూర్ ప్యాకేజీ
హైదరబాద్ - కేరళ టూర్ ప్యాకేజీ (image source https://www.irctctourism.com/)

హైదరబాద్ - కేరళ టూర్ ప్యాకేజీ

IRCTC Kerala Tour Package : కేరళకు వెళ్తే నసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అక్కడి వాతావరణం ఇట్టే నచ్చేస్తుంది. కొన్ని రోజులు అక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

Karimnagar Bank Fire: కరీంనగర్‌ యూనియన్ బ్యాంకులో అగ్నిప్రమాదం, ఫైల్స్‌, ఫర్నిచర్ దగ్ధం..

Farmer Suicide: పొలాన్ని ఆక్రమించు కోవడంతో పురుగుల మందు తాగి ఖమ్మం జిల్లా చింతకాని రైతు ఆత్మహత్య

Warangal Mlcs: కాంగ్రెస్ గూటికి వరంగల్ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు..బండా ప్రకాష్, సారయ్యల చేరికకు లైన్‌క్లియర్

Karimnagar Smartcity: 80 శాతం పూర్తైన కరీంనగర్‌ స్మార్ట్ సిటీ పనులు, పనుల పూర్తికి మరో 9 నెలల గడువు

ప్రకృతి అందాలకు కేరాఫ్ గా ఉండే కేరళను చూసేందుకు ఐఆర్‌సీటీసీ టూరిజం మంచి ప్యాకేజీలు అందిస్తోంది. తక్కవ ధరలో వెళ్లి రావొచ్చు. చాలా ప్రదేశాలు తిరిగి రావొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో నుంచి రైలులో వెళ్లాల్సి ఉంటుంది. గుంటూరు జంక్షన్, హైదరాబాద్, నల్గొండ, సికింద్రాబాద్, తెనాలి జంక్షన్ నుంచి టైన్ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ… 9 జూలై, 2024వ తేదీన అందుబాటులో ఉంటుంది.

హైదరాబాద్ - కేరళ టూర్ ప్యాకేజీ :

  • కేరళలోని అలెప్పీ, మున్నార్ సందర్శించుకోవాలని అనుకునేవారు ఈ ప్యాకేజీని ఎంచుకోవచ్చు.
  • KERALA HILLS & WATERS పేరుతో ఈ ప్యాకేజీని అందుబాటలో ఉంది.
  • జులై 9, 2024వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. కావాల్సిన వారు బుక్ చేసుకోవచ్చు. 5 రాత్రులు, 6 రోజులు ఈ టూర్ ఉంటుంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో వెళ్లొచ్చు.
  • తొలి రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి టూర్ ప్రారంభమవుతుంది. రాత్రి మెుత్తం జర్నీ ఉంటుంది.
  • రెండో రోజు మధ్యాహ్నం 12.55 గంటలకు ఎర్నాకులం రైల్వేస్టేషన్ వెళ్తారు. అక్కడ నుంచి మున్నార్ లోని హెటల్ కి వెళ్లి రెస్ట్ తీసుకుంటారు. రాత్రి మున్నార్ లోనే బస చేయాల్సి ఉంటుంది.
  • మూడో రోజు ఉదయం ఎరవికులం జాతీయ పార్క్ ను సందర్శన ఉంటుంది. మెట్టుపెట్టి డ్యామ్, ఏకో పాయింట్ కు వెళ్తారు. రాత్రి కూడా మున్నార్ లోనే బస చేస్తారు.
  • 4వ రోజు అల్లెప్పీకి వెళ్తారు. బ్యాక్ వాటర్ అందాలను చూసి ఎంజాయ్ చేయవచ్చు. రాత్రి అల్లెప్పీలోనే ఉంటారు.
  • ఐదో రోజు హెటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. అక్కడ నుంచి ఎర్నాకులం రైల్వే స్టేషన్ వెళ్తారు. ఉదయం 11.20 గంటలకు శబరి ఎక్సె ప్రెస్ లో హైదరాబాద్ కు తిరుగుపయనమవుతారు. మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వస్తారు. దీంతో కేరళ టూర్ ముగుస్తుంది.
  • హైదరాబాద్ - కేరళ టూర్ ప్యాకేజీ ధరలు : కంఫర్ట్ (3ఏ) క్లాస్ సింగిల్ షేరింగ్ కు రూ. 32,830 ధర ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 19,070 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.15,590 గా ఉంది.
  • స్టాండర్డ్ క్లాస్ లో వేర్వురు ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే చిన్నారులకు కూడా వేర్వురు ధరలు నిర్ణయించారు.
  • ఈ టూర్‌లో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
  • https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR092 లింక్ పై క్లిక్ ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు.
  • ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 9701360701 / 8287932229 / 9281495843 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

తదుపరి వ్యాసం