Gold price today : హైదరాబాద్తో పాటు వివిధ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
22 June 2024, 5:36 IST
- Gold price today : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు సైతం వృద్ధి చెందాయి. ప్లాటీనం రేట్లు కూడా పెరిగాయి. ఆ వివరాలు..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
Gold price today : దేశంలో బంగారం ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి.. రూ. 67,160కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 67,150గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 6,71,600కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 6,716గా కొనసాగుతోంది.
PM Kisan Amount Increase : పీఎం కిసాన్ డబ్బులు పెంచుతారా? బడ్జెట్లో కీలక నిర్ణయం ప్రకటిస్తారా?
Budget 2024 : ఉద్యోగస్తులకు శుభవార్త.. బడ్జెట్లో మీ కోసం ఈ 3 ప్రకటనలు!
Stocks to buy today : స్టాక్స్ టు బై ఈ రూ. 250 స్టాక్తో షార్ట్ టర్మ్లో భారీ లాభాలు!
Gold and silver prices today : మరింత దిగొచ్చిన పసిడి, వెండి ధరలు..
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 వృద్ధి చెంది.. రూ. 73,260కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 73,250గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 పెరిగి.. రూ. 7,32,600గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,310గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,410గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,160 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 73,260గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 67,810గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,980గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 67,160గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 73,260గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 67,160గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,260గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 67,210గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 73,310గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67,160గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,260గా ఉంది.
ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,410గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 పెరిగి రూ. 94,100కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 94,000గా ఉండేది.
Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 98,600 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 94,100.. బెంగళూరులో రూ. 92,950గా ఉంది.
ప్లాటీనం ధరలు ఇలా..
దేశంలో ప్లాటీనం రేట్లు శనివారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 50 పెరిగి.. రూ 26,310కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 26,260గా ఉండేది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 26,310గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.